మిల్క్ బ్యూటీ తమన్నా లాక్ డౌన్ ని చక్కగా వాడుకుంటోంది. సినిమా షూటింగ్ లు జరగడంలేదు కాబట్టి, తమన్నా ఖాళీగా ఉండకుండా ఓ టాక్ షో చేయడానికి అంగీకరించింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ 'ఆహా' అనే డిజిటల్ యాప్ ని ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ని డెవలప్ చేయడానికి మెగా ప్లాన్స్ వేస్తున్నారు మెగా నిర్మాత. అందులో భాగంగా తమన్నాతో 'ఆహా' యాప్ కోసం ఓ టాక్ షో ప్లాన్ చేసారట.
కాగా ఈ టాక్ షో కోసం తమన్నా ఒక్కో ఎపిసోడ్ కి 8 లక్షలు పారితోషికం పుచ్చుకుంటోందట. ఈ పారితోషికం ఇవ్వడానికి అల్లు అరవింద్ కూడా ఒకే చెప్పేసారట. త్వరలోనే ఈ టాక్ షో కి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి తెలియజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ టాక్ ఫస్ట్ రెండు ఎపిసోడ్ లు అల్లు అర్జున్, రాంచరణ్ లతో రూపొందనుందని తెలుస్తోంది. సో... మిల్క్ బ్యూటీ తమన్నా డిజిటల్ ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతోందన్నమాట.