స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ లు జరగడంలేదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా 'ఆచార్య' తర్వాత కొరటాల చేయబోతున్న సినిమా ఏంటీ... నిర్మాత ఎవరు? హీరో ఎవరు? అనే ఆసక్తి అందరిలో ఉంది.
తాజా వార్తల ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ భారీగా అడ్వాన్స్ ఇచ్చి కొరటాల డేట్స్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం హీరోని లాక్ చేయలేదట. కొరటాల రెడీ చేసిన ఓ స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారమ్. 2021 సెకండాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందట. మరి ఈ సినిమా ఏ హీరోతో తెరకెక్కనుంది... ఎంత బడ్జెట్ తో రూపొందనుంది తదితర వివరాలు తెలియాల్సి ఉంది.