రష్మిక మందన్నా చాలా లక్కీ గర్ల్. తను నటించిన సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో, అమ్మడిని తమ సినిమాల్లో నటింపజేయడానికి దర్శక, నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ఆ తర్వాత 'గీత గోవిందం' చేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వెంటవెంటనే ఆఫర్స్ వచ్చాయి. 'దేవదాసు', 'కామ్రేడ్' సినిమాలు చేసిన రష్మిక, ఆ వెంటనే మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేసింది. దీంతో పాటే భీష్మ' చేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది రష్మిక మందన్నా. తాజాగా మరో క్రేజీ సినిమా అవకాశం రష్మికను వరించే అవకాశముందని సమాచారమ్. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
యువసామ్రాట్ నాగచైతన్యతో 'మనం' ఫేం విక్రమ్ కె కుమార్ ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నారనే వార్లలు వచ్చాయి. ఈ వార్తలకు విక్రమ్ కుమార్ స్పందించి సమంత నటించడంలేదని క్లారటీ ఇచ్చారు. ఆ తర్వాత కీర్తిసురేష్ ని హీరోయిన్ గా నటింజేయాలనుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే రష్మికమందన్నా వైపు మొగ్గుచూపుతున్నాడట నాగచైతన్య. దాంతో దర్శక, నిర్మాతలు కూడా రష్మిక వైపు దృష్టి సారించారని తెలుస్తోంది.
సో... అన్ని కుదిరితే నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశం రష్మికమందన్నాకు దక్కుతుంది. మరి ఈ ఇద్దరి జంట ఎలా ఉంటుందో వేచిచూద్దాం.