కరోనా నిబంధనలు పాటిస్తూ పలు టివి సీరియల్స్ షూటింగ్స్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్స్ స్టార్ట్ అయినప్పట్నుంచి ముగ్గురు, నలుగురు ఆర్టిస్ట్ లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే టివి నటులు ప్రభాకర్, హరికృష్ణ, నవ్వ స్వామిలు కరోనా బారిన పడ్డారు. వారు కోలుకుంటున్నారు. తాజాగా మరో నటుడు కరోనా బారిన పడటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో తను నటిస్తున్న 'అక్కమొగుడు', 'నెంబర్ 1 కోడలు', 'మౌనరాగం' సీరియల్స్ కి చెందిన యూనిట్ సభ్యులు ఆందోళనలో ఉన్నారట. కొంతమంది కరోనా టెస్ట్ లు చేయించుకుంటున్నారని సమాచారమ్. ఇలాగే అయితే సీరియల్స్ షూటింగ్స్ కంటిన్యూ చేయడం ఏమంత శ్రేయస్కరం కాదని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. ఓవైపు హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో టివి సీరియల్స్ షూటింగ్స్ కంటిన్యూ అవుతాయా లేదా వేచిచూడాల్సిందే.