నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో ఓ సినిమాకి ప్లానింగ్ జరిగిన విషయం తెలిసిందే. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్ పెక్టర్', 'సమరసింహా రెడ్డి'; 'నరసింహనాయుడు' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. ఈ నేపధ్యంలో బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వీరి కాంబినేషన్ లో సినిమా రూపొందితే బాగుంటుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమాని ప్రస్తుతానికి బాలయ్య పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే...
బి.గోపాల్, బాలయ్య కాంబినేషన్ సినిమా కోసం కథ రెడీ అవ్వలేదట. అందుకే బాలయ్య ఈ సినిమాని పక్కన పెట్టి, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఫోన్ లో బాలయ్యకు పూరి జగన్నాధ్ ఓ స్టోరీ లైన్ వినిపించారట. కథ నచ్చడంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత పూరి దర్శకత్వంలోని సినిమాతో బాలయ్య ముందుకెళ్లే అవకాశముందని సమాచారమ్.