సీనియర్ హీరోయిన్, మాండ్యా ఇండిపెండెంట్ యం.పి సుమలత అంబరీష్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా సుమలత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తనకు మైల్డ్ గానే ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని, తనతో కాంటాక్ట్ అయిన వాళ్లందరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని సుమలత సూచించారు. తను హోమ్ క్వారంటైన్ లో ఉండబోతున్నట్టు కూడా సుమలత పేర్కొన్నారు. ఇదిలా ఉంటే...
ఈ మధ్య తన నియోజకవర్గం మాండ్యాలో తిరిగారు సుమలత. కరోనా నేపధ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆ సమయంలోనే సుమలతకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా మైల్డ్ గానే వైరస్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, సుమలత త్వరగానే కోలుకుంటారు. ఆమె అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరంలేదు.