'సైరా' నరసింహారెడ్డి సినిమా తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తదుపరి సినిమా ఇంకా ఆరంభమవ్వలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఓ కథ రెడీ చేసారు సురేందర్ రెడ్డి. ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'పుష్ప' సినిమా తర్వాత ఈ సినిమా ఆరంభమవ్వాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తవ్వలేదు. దాంతో సురేందర్ రెడ్డి, అల్లు అర్జున్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశంలేదు. ఈ నేపధ్యంలో సురేందర్ రెడ్డి మరో సినిమాని వర్కవుట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఎనర్జిటిక్ హీరో రామ్ కి ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ స్టోరీ లైన్ చెప్పారట. పవర్ ఫుల్ స్టోరీ లైన్ కావడంతో రామ్ ఈ స్టోరీ లైన్ పట్ల చాలా ఇంప్రెస్ అయినట్టు తెలుస్తోంది. దాంతో ఫుల్ స్ర్కిఫ్ట్ రెడీ చేయాల్సిందిగా చెప్పాడట రామ్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఈ స్ర్కిఫ్ట్ పని మీదే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఫుల్ స్ర్కిఫ్ట్ తో రామ్ ని కలిసే అవకాశం ఉందని సమాచారమ్. స్ర్కిఫ్ట్ నచ్చితే రామ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ కి రంగం సిద్ధమవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...
రామ్ నటించిన 'రెడ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా థియేటర్స్ మూతబడ్డాయి. అవి తెరుచుకున్న తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది.