కింగ్ నాగార్జున ఓ సినీ మీడియేటర్ ని గెట్ అవుట్ అన్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. గెట్ అవుట్ అనేంత కోపం నాగ్ కి ఎందుకు వచ్చింది... ఆ సినీ మీడియేటర్ నాగ్ కి అంత కోపం వచ్చేలా ఏం మాట్లాడాడు... అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే...
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్'. ఈ సినిమాని ఓటీటీ ఫ్లాట్ పామ్ లో స్ట్రీమింగ్ చేయించడానికి ఓ సినీ మీడియేటర్ నాగ్ ని కలిసాడట. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ పామ్ కి చాలా డిమాండ్ ఉందని, నాగ్ అంగీకరిస్తే, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' ని కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ చెయ్యొచ్చని చెప్పాడట. అంతా విన్న నాగ్ 'గెట్ అవుట్' అన్న ఒక్క మాట తప్ప మరో మాట మాట్లాడలేదట. సదురు సినీ మీడియేటర్ కూడా ఇంకో మాట మాట్లాడకుండా, భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట.
సో... టాప్ హీరోలు, క్రేజ్ ఉన్న కుర్ర హీరోలు తమ సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధంగా లేరని అర్ధం చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టేంతవరకూ ఓపికగా వేచిచూద్దాం... తమ సినిమాలను థియేటర్స్ లోనే విడుదల చేద్దామనే ప్లాన్ లోనే ఉన్నారని ఫిక్స్ అయిపోవచ్చు.