పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆ రోజు (25.1.2021) నుంచి హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లు పాల్గొనగా ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలిపారు నిర్మాత.
ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన 'ప్రసాద్ మూరెళ్ళ' ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్ గా 'నవీన్ నూలి', కళా దర్శకునిగా ఏ.ఎస్.ప్రకాష్ లు ఇప్పటివరకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీ, నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి సమర్పకులు గా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. పి.ఆర్.ఓ: యల్.వేణుగోపాల్