దీపావళి కి 'టైగర్ 3' తో రంగంలోకి దిగుతున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా భారీగా నిర్మించారు. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అత్యధిక యాక్షన్ సీక్వెన్సులున్న చిత్రంగా సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనీష్ శర్మ మాట్లాడుతూ - టైగర్ 3 లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ యాక్షన్ పెయిర్ టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్, జోయా పాత్రలో కత్రినా కైఫ్ నటించారు. ఇది వారిద్దరి కథ. వారిద్దరూ కలిసినప్పుడు సంఘర్షణ ఉంటూనే వస్తుంది. వారి మధ్య బంధం పెరిగే కొద్ది ఈ సంఘర్షణ పెరిగిందే కానీ తగ్గలేదు. టైగర్ 3లో ఈ సంఘర్షణ ఇంకా బలంగా కనిపించనుంది. అందుకు తగినట్లు యాక్షన్ సన్నివేశాలు మెప్పించనున్నాయి. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ధీటుగా టైగర్ 3లో సన్నివేశాలు మెప్పించనున్నాయి. సినిమాలో సల్మాన్, కత్రినా పాత్రలు ఎదుర్కొనే సమస్యల్లో ఉండే తీవ్రత వల్ల సినిమా చాలా వేగవంతంగా సాగుతుంది. ఈ మూవీలో 12 అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఇవి ప్రేక్షకులు సీట్ ఎడ్జ్లో కూర్చొనిపెట్టి చూసేలా చేేస్తాయి. ఇక అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది. టైగర్, జోయా ఫ్యాన్స్కైతే ఇదొక ట్రీట్లా ఉంటుంది. ఐమ్యాక్స్లో ఈ యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తాయి అన్నారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందుతోన్న టైగర్ 3.. నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.