ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందనుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ యేడాది నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభోత్స కార్యక్రమాన్ని జరిపి, 'సైరా' నరసింహారెడ్డి షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే...
తాజాగా కొరటాలకు సంబంధించి మరో వార్త బయటికి వచ్చింది. ప్రస్తుతం 'సాహో చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ దృష్టి కొరటాలపై ఉందట. కొరటాలతో సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాడట ప్రభాస్. 'సాహో' తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. తన కోసం కొరటాల మంచి కథ రెడీ చేస్తే.. రాధాకృష్ణ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేయాలని భావిస్తున్నాడట. 'మిర్చి' కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటే, అందరిలో ఆసక్తి నెలకొనడం ఖాయం. కొరటాల కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. అన్ని కుదిరితే 'మిర్చి' కాంబినేషన్ రిపీట్ అవుతుందని ఫిక్స్ అయిపోవచ్చు.