మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా థియేటర్స్ కి వస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ సినిమా విడుదల సమ్మర్ కి సాధ్యం కాదనేది తాజా సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...
2020 సంక్రాంతి కానుకగా 'సైరా' నరసింహారెడ్డి చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత రాంచరణ్ భావిస్తున్నాడట. భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని నిర్మిస్తున్న రాంచరణ్ అంతే భారీగా మార్కెటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇంత భారీగా బిజినెస్ చేయాలంటే విజువల్ గా సినిమా చాలా గ్రాండ్ గా ఉండాలి కాబట్టి, విజువల్ వండర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దాలని ఫిక్స్ అయ్యారట. యుద్ధ సన్నివేశాలను... సిజి, విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలకు అప్పగించి ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చేయించాలనుకుంటున్నాడట రాంచరణ్. ఈ వర్క్ ని అర్జెంట్ గా పూర్తి చేయడం కుదరదు. ఈ వర్క్ అప్పగించిన సంస్థలు టైమ్ తీసుకుంటాయి. వారికి టైమ్ ఇవ్వకుండా కాంప్రమైజ్ అయితే, ఆ ఎఫెక్ట్ విజువల్స్ మీద పడుతుంది. అది రాంచరణ్ కి ఇష్టంలేదట. అందుకే వచ్చే యేడాది సమ్మర్ కి కాకుండా, 2020 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలని మెగా కాంపౌండ్ డిసైడ్ అయ్యిందట. మరి ఇదే కనుక నిజమైతే, మెగా ఫ్యాన్స్ కొంచెం నిరాశపడటం ఖాయం. ఈ షాకింగ్ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే, మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.