'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమవ్వాలని, ఆ దిశగా జనసేన కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసి నడిపించాలని ఫిక్స్ అయ్యారట జనసేనాని. ఇదిలా ఉంటే...
పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నారని, ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించబోతున్నాడని వార్తలు ప్రచారమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి 40కోట్ల పారితోషికం, బోయపాటికి 10కోట్ల పారితోషికం ఆఫర్ చేసాడట బండ్ల. 100కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.