స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మల్టీస్టారర్ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రాజమౌళి సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.
మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడని వార్తలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్.
కాగా తాజా వార్తల ప్రకారం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆల్ రెడీ కథ కూడా వర్కవుట్ చేస్తున్నారట. ఓ స్టోరీ లైన్ రాజమౌళికి చెప్పారట విజయేంద్రప్రసాద్. ఆ స్టోరీ లైన్ రాజమౌళికి నచ్చడంతో డెవలప్ చేయమని అన్నారట. సో... రాజమౌళి, మహేష్ క్రేజీ కాంబినేషన్ కి కథ రెడీ అవుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ వచ్చే యేడాది చివరిలో పట్టాలెక్కుతుందో లేక 2020 లో సెట్స్ పైకి వెళుతుందో వేచి చూడాల్సిందే.