'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి హీరోయిన్ ని కన్ ఫార్మ్ చేయడానికి చిరు, కొరటాల మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఖైదీ.నెం.150 కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. సైరా నరసింహారెడ్డి లో నయనతార కథానాయికగా నటిస్తోంది.
ఈ నేపధ్యంలో చిరు తదుపరి సినిమాకి సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలా లేక కొత్త అమ్మాయిని రంగంలోకి దింపాలా అనే చర్చలు జరుగుతున్నాయట. కొరటాల శివ అయితే బాలీవుడ్ నుంచి హీరోయిన్ ని తీసుకురావాలని భావిస్తున్నాడట. బాలీవుడ్ హీరోయిన్ కుదరకపోతే, కొత్త అమ్మాయిని రంగంలోకి దింపే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఫైనల్ గా చిరు, కొరటాల క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికి దక్కనుందో వేచి చూద్దాం.