ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే...
ఈ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరిలో ఎవరో ఒకరు గెస్ట్ అఫియరెన్స్ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. 20 నిముషాల నిడివితో ఈ గెస్ట్ రోల్ ఉంటుందట. ఇది నిజంగా సినిమాకి చాలా హైప్ తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. నాన్నకు ప్రేమతో చిత్రంతో ఎన్టీఆర్ కి చక్కటి విజయాన్ని అందించాడు సుకుమార్. ఇక రంగస్థలంతో రాంచరణ్ కి ఓ భారీ హిట్ సినిమా ఇచ్చాడు. ఈ నేపధ్యంలో సుకుమార్ అడిగిన మీదట ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ మహేష్ సినిమాలో గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని సుకుమార్ వాడుకోబోతున్నాడనేది సస్పెన్స్. పైపెచ్చు ఈ మధ్య మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ చేయబోతున్న మల్టీస్టారర్ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే వార్తలు గత రెండు, మూడు రోజుల నుంచి హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం ఎన్టీఆర్ లేదా రాంచరణ్ గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వబోతున్నరానే వార్త. దీన్నిబట్టి టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరికొకరు సహకరించుకుంటూ తాము చేసే ప్రాజెక్ట్స్ లకు మంచి క్రేజ్ ని తెచ్చిపెడుతున్నారు. ఇది టాలీవుడ్ లో జరుగుతున్న చక్కటి పరిణామం అని చెప్పొచ్చు.