'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలు ఉన్నాయి. ఎన్టీఆర్ హీరోగా ఈ భారీ బడ్జెట్ చిత్రం రూపొందనుందని, ఈ సినిమా కోసం దాదాపు 3యేళ్లు ఎన్టీఆర్ డేట్స్ కేటాయించేసాడనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. మూడేళ్లు ఎన్టీఆర్ పబ్లిక్ కి కనిపించడని కూడా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ సినిమా గురించి హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా... మరో వార్త ప్రచారం అవుతోంది. అది ఎన్టీఆర్ అభిమానులను టెన్షన్ కి గురి చేస్తోంది.
మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనే ఆలోచన రాజమౌళికి ఉందట. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు కూడా ఆసక్తిగానే ఉన్నాడట. కాగా మహేష్ కి మంచి కథ కుదిరితే 'గరడ'ను పక్కన పెట్టేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారమ్. ముందు మహేష్ ప్రాజెక్ట్ నే సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడట. అదే కనుక జరిగితే ఎన్టీఆర్ కి రాజమౌళి హ్యాండిచ్చేస్తాడని పిల్మ్ నగర్ టాక్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయాలని ఎన్టీఆర్ అబిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'గరుడ' సినిమాపై తెగ కలలు కంటున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వకపోతే ఎన్టీఆర్ అభిమానులు నిరాశపడే అవకాశముంది.