యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ సినిమా ఆరంభమవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' పార్ట్ 2 విడుదలవ్వగానే ఎన్టీఆర్ తో రాజమౌళి ఓ భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా మరో వార్త బయటికి వచ్చింది అదేంటంటే...
రాజమౌళి కొడుకు కార్తీకేయ ఓ కథ తయారు చేసాడట. ఈ కథకు ఎన్టీఆర్ అయితే పూర్తి న్యాయం చేయగలుగుతాడట. దాంతో ఎన్టీఆర్ కి ఈ కథ చెప్పి, కార్తీకేయను దర్శకుడిగా పరిచయం చేయమని రాజమౌళి అడగాలనుకుంటున్నారట. ఒకవేళ ఇందుకు ఎన్టీఆర్ అంగీకరిస్తే, ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ రాజమౌళి చేస్తారట. ఎన్టీఆర్ 'స్టూడెంట్ నెం. 1' చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తే, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసారు. రాజమౌళి ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి కెరియర్ ఎలాంటి మలుపులు తీసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పడు కొడుకు కెరియర్ ని కూడా ఇలాగే తీర్చిదిద్దాలనుకుంటున్నారట రాజమౌళి. అందుకే ఎన్టీఆర్ ని ఒప్పించి కొడుకును దర్శకుడిగా పరిచయం చేసే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారని సమాచారమ్. మరి ఎన్టీఆర్ ఇందుకు అంగీకరిస్తాడా... వేచి చూడాల్పిందే.