రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహేష్ బాబుతో సుకుమార్ తదుపరి సినిమా తెరకెక్కనుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి స్టోరీ లైన్ సెట్ అయ్యిందట.
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్ర్కిఫ్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న సుకుమార్ ఈ సినిమాకి హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారమ్. మహేష్ బాబుతో రకుల్ ప్రీత్ సింగ్ ఆల్ రెడీ 'స్పైడర్' సినిమా కోసం జత కట్టింది. ఇప్పుడు సుకుమార్, మహేష్ సినిమా చేసే అవకాశం దక్కితే. రెండోసారి ప్రిన్స్ తో జత కట్టే అవకాశం రకుల్ కి దక్కినట్టు అవుతుంది.
మహేష్, సుకుమార్ కాంబినేషన్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. '1 నేనొక్కడినే' తర్వాత సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందనున్న రెండో సినిమా ఇది. '1 నేనొక్కడినే' ఫ్లాప్ అయిన నేపధ్యంలో మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేయాలనే టార్గెట్ తో ఉన్నాడట సుకుమార్. సో... ఈసారి ఈ కాంబినేషన్ మిస్ ఫైర్ అయ్యే అవకాశంలేదని ఫిక్స్ అయిపోవచ్చు.