మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంలో కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దరూ ప్రేమలో పడిపోయారని, రెండో సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' షూటింగ్ సమయంలో ఇద్దరూ బాగా దగ్గరయ్యారని, అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారని జనాలు చెప్పుకుంటున్నారు. అయితే మా ఇద్దరి మధ్య ఏమీ లేదని రెజీనా ఓ సందర్భంలో చెప్పింది. కానీ రెజీనా చెబుతున్నది అబద్ధమని ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకోవాలని సాయిధరమ్ తేజ్ ఫిక్సయ్యాడట.
ఈ మధ్య తన అమ్మ దగ్గరికి రెజీనాని తీసుకెళ్లి పెళ్లి విషయం మాట్లాడాలనుకున్నాడట సాయిధరమ్. వచ్చే యేడాది పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్సయ్యాడట. అయితే ఇందుకు రెజీనా అంగీకరించడంలేదని తెలుస్తోంది, ఇప్పుడే పెళ్లంటే కుదరదని చెబుతోందట. ఈ విషయంలో ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారమ్. మరి ఫైనల్ గా సాయిధరమ్ తేజ్ తో పెళ్లికి రెజీనా అంగీకరిస్తుందో, లేక ఈ హీరోగారిని అప్ సెట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. సాయిధరమ్ తేజ్ మాత్రం ఎలాగైనా రెజీనాని ఒప్పించి, తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి పీటలెక్కేయాలనుకుంటున్నాడట.