మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించడానికి రంగం సిద్ధమయ్యింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభమవుతుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ వినబడుతోంది. అదేంటంటే...
ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లడంలేదట. ఈ యేడాది చివరిలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం నాగచైతన్యతో 'సవ్యసాచి', రవితేజ తో 'అమర్ అక్బర్ ఆంటోని', విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్' చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలన్నీ సెట్స్ పైన ఉన్నాయి కాబట్టి, సాయిధరమ్ తేజ్ సినిమాని ఇమ్మీడియట్ గా కాకుండా కొంత గ్యాప్ తీసుకుని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారమ్. అందుకే సాయిధరమ్ తేజ్ సినిమా వెనక్కి వెళ్లి ఉంటుందని ఊహించవచ్చు.