ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'జనతా గ్యారేజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఎన్టీఆర్ స్టైల్ మాస్ మూవీ కావడం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించడం.. భారీ అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయి. ఈ చిత్రంలో మలయాళ నటుడు మోహన్ లాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనది ఎన్టీఆర్ మేనమామ పాత్ర. ఈ పాత్రను ముందుగా హరికృష్ణతో చేయించాలనుకున్నారనే టాక్ వినిపించింది. తండ్రి, కొడుకు ఒక తెర మీద కనిపిస్తే, చూడ్డానికి చాలా బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ, మోహన్ లాల్ ని తీసుకున్నారు. అయితే ఈ చిత్రంలో హరికృష్ణ కనిపిస్తారన్నది తాజా సమాచారం.
'జనతా గ్యారేజ్'లో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ పాత్రకు హరికృష్ణను తీసుకోవాలనుకుంటున్నారని ఫిలిం నగర్ టాక్. అదే కనుక జరిగితే తండ్రి, కొడుకుని ఒకే తెర మీద చూడటం అభిమానులకు పండగలా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే, హరికృష్ణ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారని కూడా అనొచ్చు.