'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయాలనుకుంటున్న రాజమౌళి తమిళ్ స్టార్ హీరో సూర్యను ఈ మల్టీస్టారర్ లో నటింపజేయబోతున్నారట. కాగా ఈ సినిమాని నిర్మించడానికి ప్రిన్స్ మహేష్ బాబు బావ, ఎం.పి గల్లా జయదేవ్ ఆసక్తి కనబరుస్తున్నారనే వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉంటే...
తాజా వార్తల ప్రకారం ఓ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజమౌళితో ఈ సినిమా గురించి చర్చిస్తున్నారట. హిందీలో ఈ మల్టీస్టారర్ కి నిర్మాతగా వ్యవహరించే అవకాశం తనకు ఇవ్వమని ఈ బాలీవుడ్ నిర్మాత కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్మాతను చేర్చుకోవడం వల్ల ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సినిమాని పూర్తి చేయగలమనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మల్టీస్టారర్ లో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన కొంతమంది నటీనటులను నటింపజేయాలనుకుంటున్నారట. దానివల్ల బిజినెన్ కి ప్లస్ అవుతుందనేది రాజమౌళి ఆలోచన అని తెలుస్తోంది.
ఇది చాలా అద్భుతమైన కథ అని, ఎన్టీఆర్ కి ఆల్ రెడీ రాజమౌళి ఈ స్టోరీ లైన్ చెప్పేసారని సమాచారమ్. ఓ టైటిల్ కూడా ఈ మల్టీస్టారర్ కోసం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సో... 'బాహుబలి' రెండు పార్ట్ ల స్థాయిని మించే సినిమా చేయడానికి రాజమౌళి సమాయత్తమవుతున్నారని ఊహించవచ్చు.