యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి హిట్ చిత్రాలు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందాయి. మళ్లీ వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందాని అందరు ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి 2' చిత్రం విడుదలైన వెంటనే రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది. ఇది భారీ మల్టీస్టారర్ సినిమా అని సమాచారమ్. ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ తో పాటు తమిళ్ స్టార్ హీరో సూర్యను నటింపజేయబోతున్నారట రాజమౌళి. ఇదిలా ఉంటే...
ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేయాలనుకుంటున్నారట రాజమౌళి. కాగా ఈ సినిమాని నిర్మించడానికి ప్రిన్స్ మహేష్ బాబు బావ, ఎం.పి గల్లా జయదేవ్ ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారమ్. ఈ సినిమాని నిర్మించే అవకాశం గల్లా జయదేవ్ కి ఇవ్వడానికి రాజమౌళి కూడా సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రానికి సంబంధించి గల్లా జయదేవ్, రాజమౌళి మధ్య చర్చలు జరుగుతున్నాయట. అలాగే ఎన్టీఆర్, సూర్యతో కూడా చర్చిస్తున్నారట రాజమౌళి. ఇది చాలా అద్భుతమైన కథ అని, ఎన్టీఆర్ కి ఆల్ రెడీ ఈ స్టోరీ లైన్ చెప్పేసారని సమాచారమ్. ఓ టైటిల్ కూడా ఈ మల్టీస్టారర్ కోసం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సో.. మహేష్ బావ ఈ సినిమాని నిర్మిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఇదే జరుగుతుందేమో వేచి చూద్దాం.