పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందో లేదోగానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అల్లు అర్జున్ కి చుక్కలు చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి అడిగితే 'చెప్పను బ్రదర్' అని అల్లు అర్జున్ అన్నప్పట్నుంచి ఈ వివాదం రేగింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా తయారయ్యింది. సోషల్ మీడియా సాక్షిగా ఈ వివాదం అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంది. అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాధమ్' చిత్రం టీజర్ యుట్యూబ్ లో విడుదలైనప్పట్నుంచి ఈ విషయం ఇంకా తేట తెల్లమయ్యింది. 'దువ్వాడ జగన్నాధమ్' టీజర్ ని లైక్ చేసిన వారి సంఖ్య ఎంతుందో, అంతే సంఖ్యలో డిస్ లైక్ చేసిన వారు ఉన్నారు. 'దువ్వాడ...' టీజర్ ని పనిగట్టుకుని డిస్ లైక్ చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. సినిమా మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి స్వయంగా అల్లు అర్జున్ రంగం సిద్ధం చేసాడని తెలుస్తోంది. 'రేసు గుర్రం' చిత్రంలో పవన్ కళ్యాణ్ పాటను వాడుకుని తనకు పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉందో చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు కూడా ఇదే ఫాలో అయ్యాడని తెలుస్తోంది. 'దువ్వాడ జగన్నాధమ్' చిత్రంలో పవన్ కళ్యాణ్ ని రిఫరెన్స్ చేసేటట్టు ఓ ఎపిసోడ్ ని పొందుపరిచారట. ఈ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ కి ఎంత అభిమానం ఉందో తెలియజేప్పే విధంగా ఉంటుందట. ఈ ఎపిసోడ్ పవన్ అభిమనులను ఇంప్రెస్ చేయడం ఖాయమని భావిస్తున్నారట. స్వతహాగా డైరెక్టర్ హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ అంటే అబిమానం. దాంతో 'దువ్వాడ జగన్నాధమ్' చిత్రంలో పవన్ ని రిఫర్ చేసే ఎపిసోడ్ ని అద్భుతంగా తీర్చిదిద్దాడట. సో... పవన్ అభిమానులను కూల్ చేయడానికి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అల్లు అర్జున్ పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగుతున్నాడు. మరి వర్కవుట్ అవుతుందా వేచి చూద్దాం.