పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి భారీ ప్లానింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. 100కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ని 25కోట్ల రూపాయల బడ్జెట్ తో చిత్రీకరించబోతున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపారట త్రివిక్రమ్.
కాగా తాజా వార్తల ప్రకారం ఏప్రిల్ 6 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుందని తెలుస్తోంది. ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ చిత్రం షూటింగ్ ఆరంభంకానుంది. రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించనున్న ఈ ఫైట్ కి విజయన్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించనున్నారు. ఈ 24న 'కాటమరాయుడు' చిత్రం విడుదలయ్యింది. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే తదుపరి సినిమా షూటింగ్ తో బిజీ అవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్. సో.. పవన్ పక్కా ప్లానింగ్ తోనే వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడని చెప్పొచ్చు.