మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకటి బి.గోపాల్ దర్శకత్వంలో 'ఆరడుగుల బుల్లెట్'. ఇంకొకటి సంపత్ నంది దర్శకత్వంలో 'గౌతమ్ నంద'. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన గోపీచంద్ లుక్ సినిమాలపై అంచనాలను పెంచేసింది. స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు. ఇదిలా ఉంటే...
'గౌతమ్ నంద' చిత్రంలో గోపీచంద్ సరసన క్యాథరీన్, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం మరో బ్యూటీని రంగంలోకి దింపారని తెలుస్తోంది. గోపీచంద్ పర్సనల్ సెక్రటరీగా నతాషా అస్సాడి ఓ కీలక పాత్ర చేస్తోందట. ఈ నటాషా 2015 లో మిస్ ఇండియా యూనివర్శ్ ఫస్ట్ రన్నరప్. 'గౌతమనంద' లో ఎన్నారై గర్ల్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నటించడం పట్ల ముంబయ్ బ్యూటీ నతాషా ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా తర్వాత సౌత్ లో తనకు మంచి ఆఫర్స్ వస్తాయనే నమ్మకంతో ఉందట నతాషా. మరి గౌతమ్ నంద ఏ మేరకు నతాషాకు కలిసొస్తాడో వేచి చూద్దాం.