రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. అయితే రాంచరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపించరు. మరోసారి ఈ ఇద్దరు ఓ సినిమా కోసం కలవబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కూడా ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపంచరు. రాంచరణ్ కనిపిస్తాడు. అల్లు అర్జున్ మాటలు వినిపిస్తాయి. ఇంతకీ ఈ సినిమా వివరాలు ఏంటీ అనే విషయంలోకి వెళితే....
కన్నడంలో ధృవ్ సార్జా, రాధిక పండిట్ కాంబినేషన్ లో 9కోట్ల బడ్జెట్ తో చేతన్ కుమార్ దర్శకత్వంలో 'బహుద్దూర్' చిత్రం రూపొందింది. ఈ చిత్రం 20కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. కాగా ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, అల్లు అర్జున్ కలిసి చూడటం జరిగిందట. ఈ చిత్రం ఈ ఇద్దరికి బాగా నచ్చిందని సమాచారమ్. దాంతో ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుని రాంచరణ్ ని హీరోగా నటింపజేయాలనే ఆలోచన అల్లు అరవింద్ కి ఉందట. అలాగే కన్నడ వెర్షన్ కి పునీత్ రాజ్ కుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తెలుగు వెర్షన్ కోసం అల్లు అర్జున్ తో వాయిస్ ఓవర్ ఇప్పించాలని అల్లు అరవింద్ భావిస్తున్నారట. ఈ వార్తలకు తగ్గట్టు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 'చరణ్ అర్జున్' టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. 'బహుద్దూర్' ని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనతోనే ఈ టైటిల్ ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిజిస్టర్ చేయంచి ఉంటారని జనాలు చెప్పుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే రాంచరణ్ సినిమాకి అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ఇస్తాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూద్దాం.