యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోన్న రాశిఖన్నా పాల్గొనగా పెళ్లి సీన్ చిత్రీకరిస్తున్నారట. ఇదిలా ఉంటే...
ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కుల నిమిత్తం భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ చానెల్ జెమిని 14కోట్లు ఇచ్చి మరీ ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారమ్. ఎన్టీఆర్ గత చిత్రాల కంటే 'జై లవ కుశ' శాటిలైట్ హక్కుల కోసం భారీ మొత్తం దక్కిందని చెప్పొచ్చు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టేబుల్ ప్రాఫిట్ తో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సో.. అన్నయ్యకు తమ్ముడు ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమాతో భారీ గిఫ్ట్ నే ఇస్తున్నాడని చెప్పొచ్చు.