కొరటాల శివ ఇప్పటివరకూ మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రభాస్ తో 'మిర్చి', మహేష్ బాబుతో 'శ్రీమంతుడు', ఎన్టీఆర్ తో 'జనతాగ్యారేజ్' చిత్రాలు చేసాడు. ఈ మూడు చిత్రాల్లోనూ హీరో తర్వాత పవర్ ఫుల్ పాత్ర తండ్రి పాత్ర. 'మిర్చి' లో ప్రభాస్ తండ్రిగా సత్యరాజ్ చేసిన పాత్రను ఎవ్వరూ మర్చిపోలేరు. ఊరు కోసం భార్య, పిల్లలకు సైతం దూరంగా ఉంటూ, ఊరి ప్రజల బాగుగోలు కోరుకుంటూ, పగ, ప్రతీకారాలకు దూరంగా ప్రజలను ఉంచుతూ ఉన్నతంగా బ్రతికే వ్యక్తి పాత్ర. ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంటుంది.
రెండో సినిమా 'శ్రీమంతుడు' లో మహేష్ బాబు తండ్రిగా జగపతిబాబు నటించాడు. చదువుకున్న వ్యక్తిగా తన గ్రామన్ని అభివృద్ది చేయడం కోసం ఆరాటపడే వ్యక్తిగా జగపతిబాబు ఫ్ల్యాష్ బ్యాక్, మిలీనియర్ గా జగపతిబాబు క్లాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ ని అబ్బురపరిచింది. ఈ పాత్ర తీర్చిదిద్దిన విధానానికి కొరటాలను అభినందించని వారు ఉండరు. అంతలా ఆ క్యారెక్టర్ ఆడియన్స్ మసనుల్లో నిలిచిపోయింది.
మూడో సినిమా 'జనతాగ్యారేజ్' లో ఎన్టీఆర్ పెదనానగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించారు. సమాజంలో చీడపురుగులను ఏరిపారివేసే పాత్ర.. తప్పటడుగు వేసిన కొడుకును సైతం చంపేయడానికి వెనుకాడని తండ్రి పాత్ర. ఈ పాత్ర అద్భుతంగా ఉంటుంది. సినిమాకి ఈ పాత్ర హైలైట్.
కాగా ఈ మూడు సినిమాల్లో హీరో తర్వాత పవర్ ఫుల్ పాత్ర తండ్రిది. కాబట్టి కొరటాల నాలుగో సినిమాలో కూడా ఇలాంటి ఓ పవర్ ఫుల్ పాత్ర ఉంటుందని ఊహించడం సహజం. అయితే నాలుగో సినిమాలో ఇలాంటి పాత్ర ఉండదట.
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ నాలుగో సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందట. మరో కీలక పాత్రకు స్కోప్ లేదని తెలుస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా కొరటాల శివ నాలుగో సినిమా ఉండబోతోందని, స్ర్కీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారమ్. ఓ రకంగా చెప్పాలంటే ఈ మూడు సినిమాల్లో తండ్రి పాత్రను సెంటిమెంట్ గా ఫీలైన కొరటాల నాలుగో సినిమా విషయంలో మాత్రం ఆ సెంటిమెంట్ ని పక్కన పెట్టేసి మహేష్ పాత్ర చుట్టూనే సినిమా తిరిగేలా స్ర్కిఫ్ట్ తయారు చేసుకున్నాడట. 'భరత్ అనే నేను' టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సో.... కొరటాల మూడు చిత్రాలకు హైలైట్ గా నిలిచిన తండ్రులు నాలుగో సినిమాలో ఉండబోరని ఫిక్స్ అయిపోవచ్చు.