'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రూపొందుతోన్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకి బిజినెస్ పరంగా భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ సినిమాకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ చిత్ర నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అథినేత యస్.రాధాకృష్ణ కూడా పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా సీడెడ్ పంపిణీ హక్కుల నిమిత్తం 18కోట్లు డిమాండ్ చేసారట నిర్మాత రాథాకృష్ణ. ఈ డిమాండ్ పంపిణీదారులను షాక్ కి గురి చేస్తోంది. ఎందుకంటే 18కోట్లు ఇచ్చి ఈ సినిమా పంపణీ హక్కులు పొందితే, సీడెడ్ లోనే దాదాపు 20కోట్లు షేర్ ని ఈ సినిమా రాబట్టాల్సి ఉంటుంది. అది సాధ్యమేనా అని పంపిణీదారులు లెక్కలు వేసుకుంటున్నారట. బాహుబలి ఫస్ట్ పార్ట్ 22కోట్లు, బాహుబలి సెకండ్ పార్ట్ 30కోట్లు షేర్ ని రాబట్టినట్టు తెలుస్తోంది. బాహుబలి తప్ప ఈ ఏరియాలో ఇప్పటివరకూ ఏ సినిమా కూడా 20కోట్లు షేర్ ని సాధించిన దాఖలాలు లేవు. మరి అలాంటప్పుడు నిర్మాత యస్.రాథాకృష్ణ 18కోట్లు ఈ ఏరియా కోసం డిమాండ్ చేస్తే, పంపిణీదారులు ఇంత మొత్తం ఇచ్చి హక్కులు దక్కించుకోవడానికి ముందుకు వస్తారా.. ఒకవేళ ఇంత ఇచ్చి దక్కించుకున్నా వారు లాభాలు చవిచూసే అవకాశముందా అని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయట, మరి ఫైనల్ గా పవన్ నిర్మాత డిమాండ్ కి పంపిణీదారులు తలొగ్గుతారో.. సీడెడ్ హక్కులు ఎవరు కైవసం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.