యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రాశిఖన్నా పాల్గొనగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం ఆడియో వేడుకకు కూడా ప్లానింగ్ జరుగుతోందట.
సెప్టెంబర్ 3వ తారీఖున ఈ చిత్రం ఆడియో వేడుకను ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్టార్ డైరెక్టర్ యస్.యస్.రాజమౌళి ఈ చిత్రం ఆడియోకి ముఖ్య అతిధిగా విచ్చేయబోతున్నారని సమాచారమ్. ముందుగా నందమూరి హరికృష్ణ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న 'జై లవ కుశ' ఆడియో వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేసారట. కానీ 'బిగ్ బాస్' షో షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనాల్సి ఉండటంతో సెప్టెంబర్ 3న ఆడియో వేడుక జరపాలని ఫిక్స్ అయ్యారట. ఇదిలా ఉంటే రేపు 'లవ' టీజర్ ని విడుదల చేయబోతున్నారు. దాంతో అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.