ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. 2కోట్ల ఖర్చుతో ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అసెంబ్లీ సెట్ వేసారు.
కాగా ప్రస్తుతం ఈ సెట్ లో సి.యం, ప్రతిపక్షనాయకుడు, స్పీకర్ తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొనగా కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ప్రతిపక్షనాయకుడిగా దేవరాజ్ ని తీసుకున్న కొరటాల, స్పీకర్ గా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితను రంగంలోకి దింపాడట. కమెడీయన్ ఫృథ్వీ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడట. సో... అసెంబ్లీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చ, ఆ మధ్యలో ఫృధ్వీలాంటి ఎమ్మెల్యేల పొలిటికల్ సెటైర్లతో సీన్స్ ని చిత్రీకరిస్తున్నారని ఊహించవచ్చు. ఈ నెల 27న మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం థియేటర్స్ కి వస్తోంది. ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో మహేష్ బాబు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాల్సిందే.