పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ తో యూరోప్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ కన్ ఫార్మ్ అయ్యిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే…
డిసెంబర్ 14న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఆల్ రెడీ త్రివిక్రమ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘బైటికొచ్చి చూస్తే..’ పాటను విడుదల చేసారు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఒకటి, రెండు సింగిల్స్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అనంతరం ఆడియో వేడుకను డిసెంబర్ 14న గ్రాండ్ గా జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. కీర్తి సురేష్, అనుఇమ్మాన్యువేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారట.