మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ 6 నుంచి ఆరంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, సునీల్... ఇలా భారీ తారాగణం నటించబోతోంది. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం ఓవర్ సీస్ నుంచి 200మంది జూనియర్ ఆర్టిస్ట్ లను దించబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి,
బ్రిటిష్ పరిపాలన కాలంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కనున్నసినిమా కాబట్టి, జూనియర్ ఆర్టిస్ట్ లను ఓవర్ సీస్ నుంచి దింపుతున్నారట. 200మందిని అక్కడి నుంచి రప్పించి వారు ఇక్కడ స్టే చేయడానికి ఏర్పాట్లు చేయబోతున్నారని తెలుస్తోంది. దాదాపు 200కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నారు. అందుకే ఏ విషయంలోనూ క్రాంప్రమైజ్ అవ్వకూడదని ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్న మెగాపవర్ స్టార్ రాంచరణ్ భావిస్తున్నట్లు సమాచారమ్.