యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుంది. కాగా ఈ సినిమా కోసం సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేస్తున్నారట.
ముందుగా ఈ సినిమా కోసం అనిరుధ్ రవిచంద్రన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టడంతో యస్.యస్.తమన్ ని సంగీత దర్శకుడిగా ఫైనలైజ్ చేసారనే వార్తలు ఉన్నాయి. అలాగే కెమెరామ్యాన్ విషయంలో కూడా మార్పు జరిగినట్టు తెలుస్తోంది. నటరాజసుబ్రమణ్యంని ఈ సినిమా కోసం కెమెరామ్యాన్ గా తీసుకున్నారట.ఇప్పుడు అతనిని తప్పించి పి.యస్.వినోద్ ని రంగంలోకి దింపారని సమాచారమ్. ఇప్పటివరకూ ఎన్టీఆర్ సినిమాలకు పి.యస్.వినోద్ కెమెరామ్యాన్ గా వ్యవహరించలేదు. ఫస్ట్ టైమ్ అతను ఎన్టీఆర్ సినిమాకి వర్క్ చేయబోతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్, పి.యస్.వినోద్ లొకేషన్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారట. సో... ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయని చెప్పొచ్చు.