'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూసారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాల తర్వాత మళ్లీ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందాని నందమూరి అభిమానులతో పాటు సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. అదేంటంటే...
ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 10న జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి ఆరంభమవుతుందని సమాచారమ్. ఈలోపు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని పూర్తి చేయాలనే ప్లాన్ లో బాలయ్య ఉన్నాడట. మార్చి 29 నుంచి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ఆరంభంకానుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత యస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నాడట. మొత్తం మీద 'జై సింహా' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బాలయ్య, ఇక బ్రేక్ లేకుండా సినిమాలు చేయడానికి పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడని ఊహించవచ్చు.