అటు మెగాభిమానులు.. ఇటు తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ ఈ సినిమా కోసం టైమ్ కేటాయించలేకపోతున్నానని ఏ.ఆర్.రహమాన్ ఈ సినిమా అవకాశాన్ని తిరస్కరించారు.
'సైరా' టీజర్ కి యస్.యస్.తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. దాంతో అతనికే ఈ సినిమాకి పాటలందించే అవకాశం దక్కుతుందనే వార్తలు వచ్చాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేదిని ఫైనలైజ్ చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి కీలక పాత్రలు చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.