నైజాం ఏరియాకి దిల్ రాజు రారాజులాంటివాడు. నైజాం ఏరియాలో పంపిణీదారుడిగా దిల్ రాజుది అగ్రస్థానం. ఎన్నో చిత్రాలను ఆ ఏరియాలో పంపిణీ చేసి, భారీ లాభాలను చవిచూసాడు. ఇక తను నిర్మించిన సినిమాలను నైజాంలో పెద్ద ఎత్తున విడుదల చేసి కూడా లాభాలను చవిచూసిన దిల్ రాజుకు 'శ్రీనివాస కళ్యాణం' భారీ షాకిచ్చింది.
నితిన్ హీరోగా 'శతమానం భవతి' ఫేం సతీష్ వేగ్నశ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' ఈ నెల 9న విడుదలై తొలి షోతోనే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. దిల్ రాజు సినిమాలకున్న క్రేజ్ తో కనీసం నైజాంలో అయినా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందేమోనని ట్రెడ్ వర్గాలు లెక్కలు వేసాయి. అయితే దిల్ రాజును నిరాశపరుస్తూ మొదటి వారం పూర్తయ్యేసరికి 4.7కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇది నిజంగా షాకింగ్ ఫిగర్. ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు దిల్ రాజు. ఈ నేపధ్యంలో ఈ సినిమా రాబట్టిన వసూళ్లను బట్టి దిల్ రాజు భారీగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తం మీద భారీ అంచనాలతో విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం' భారీ షాకిచ్చింది.