విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం ఈ బుధవారం విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుని ముందుకు దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'ఛలో' ఫేం రష్మిక కథానాయికగా నటించింది. 'ఛలో', 'గీత గోవిందం' రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ప్రస్తుతం టాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి రష్మిక పై పడింది. ఆమెను తమ సినిమాలో తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. రష్మిక కి వచ్చిన ఈ క్రేజ్ కొంతమంది హీరోయిన్ల అవకాశాలను గండికొడుతున్నాయి. ఇదిలా ఉంటే...
'గీత గోవిందం' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ముందుగా లావణ్య త్రిపాఠి ని వరించింది. విజయ్ దేవరకొండ, లావణ్య త్రిపాఠి పాల్గొనగా ఓ ఫోటో షూట్ కూడా జరిగిందట. కానీ ఎందుకనో లావణ్యను ఈ సినిమా కోసం తీసుకోలేదు. ఆ తర్వాత రాశిఖన్నాని కాంటాక్ట్ చేసారట. ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. ఫైనల్ గా రష్మిక కి ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆమె పంట పండిపోయింది. ఫోటో షూట్ లో పాల్గొన్న లావణ్యకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చుంటే... కనీసం రెండు, మూడు సినిమాల్లో నటించే అవకాశం అయినా వచ్చుండేది. ఏం చేద్దాం వర్కవుట్ అవ్వలేదు...!