శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు', సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'పడి పడి లేచే మనసు'రొమాంటిక్ ఎంటర్ టైనర్. కోల్ కత్తా సిటీ నేపథ్యంతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. కోల్ కత్తా లో భారీ షెడ్యూల్ చేసారు.
ప్రస్తుతం కోల్ కత్తా సిటీని మ్యాచ్ చేసే విధంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ ని సెట్ చేసుకుని కొన్ని సీన్లు శర్వానంద్, సాయిపల్లవిగా పాల్గొనగా చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ హను రాఘవపూడి. శర్వా, సాయిపల్లవి ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ అదిరిపోతుందనే టాక్ వినబడుతోంది. ఇప్పటికే 'పడి పడి లేచే మనసు' ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి శర్వా, సాయిపల్లవి, హను రాఘవపూడి కాంబినేషన్ ఏం మ్యాజిక్ చేస్తుందో వేచి చూద్దాం.