యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం పూజా హెగ్డెని హీరోయిన్ గా కన్ ఫార్మ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. పూజా ఫోటో షూట్ లో కూడా పాల్గొంది. కొన్ని రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ లో జాయిన్ అవ్వడానికి సమా యత్తమవుతోందట. ఈలోపు ప్రభాస్ ఇచ్చిన షాక్ కి పూజా హెగ్డె చాలా అప్ సెట్ అయ్యిందనే వార్తలు ప్రచారమవుతున్నాయి.
పూజా హెగ్డె ని పక్కన పెట్టి వేరే హీరోయిన్ ని తీసుకోవాల్సిందిగా డైరెక్టర్ రాధాకృష్ణకు చెప్పేసాడట ప్రభాస్. దాంతో వేరే హీరోయిన్ ని పరిశీలిస్తున్నారని సమాచారమ్. ప్రభాస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలీదుగానీ... ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంపట్ల పూజా హెగ్డె ఫుల్ హ్యాపీ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ ఇచ్చిన షాక్ తో అమ్మడు చాలా అప్ సెట్ అయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ప్రభాస్ ఎందుకు పూజా హెగ్డెతో రొమాన్స్ కి నో చెప్పాడో తెలియాల్సి ఉంది. పూజా హెగ్డె ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత వీరరాఘవ', మహేష్ బాబు సరసన 'మహర్షి' చిత్రాలు చేస్తోంది.