నాగశౌర్యతో 'ఛలో'లాంటి హిట్ చిత్రం చేసి, తొలి సినిమాతోనే చక్కటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల తదుపరి సినిమాకి రంగం సిద్ధమయ్యింది. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రష్మికమండన్నాని హీరోయిన్ గా తీసుకున్నారు.'భీష్మ' టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పాటలందించడానికి అంగీకరించాడట. 'రంగస్థలం' లాంటి హిట్ ఆల్బమ్ అందించిన దేవిశ్రీప్రసాద్ తెలుగులో ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్, మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండింటితో పాటు నితిన్ సినిమాకి కూడా పాటలివ్వబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ ఫార్మ్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆరంభమయ్యాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది.