మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు 'సైరా' నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మిస్తూ నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తో తెర పంచుకోబోతున్నాడు రాంచరణ్. తాజా వార్తల ప్రకారం మరో ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా రాంచరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారమ్.
కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి 'ఖైదీ నెం.150' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన రాంచరణ్, ఇదే బ్యానర్ లో 'సైరా' ని నిర్మిస్తున్నాడు. ఇకముందు కూడా ఈ బ్యానర్ లో సినిమాలు చేయాలని భావిస్తున్న రాంచరణ్ 'సైరా' తర్వాత ఎన్టీఆర్ హీరోగా సినిమా నిర్మించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడట. దీనికి సంబంధించి ఎన్టీఆర్ తో మాట్లాడితే... సినిమా చేయడానికి రెడీ అన్నాడట. అయితే కథ కుదరాలి, డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ అవ్వాలి కాబట్టి, ఈ ప్రాజెక్ట్ ని 2020లో ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కవుట్ చేయాలని రాంచరణ్ పక్కా ప్లాన్ మీద ఉన్నాడట. మరి 2020లో ఎన్టీఆర్ మూడ్ ఎలా ఉంటుందో... ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా వేచి చేద్దాం. ఏదేమైనా ఓ స్టార్ హీరో నిర్మిస్తున్న చిత్రంలో మరో స్టార్ హీరో నటిస్తే... ఆ కిక్కే వేరప్పా...!