విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్ బయోపిక్' ఫస్ట్ పార్ట్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. వరల్డ్ వైడ్ గా 1100 థియేటర్స్ లో విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో 600 థియేటర్స్ లో స్ర్కీనింగ్ అవుతోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళుతోంది. ఇక యు.యస్ లో స్ర్కీనింగ్ అయిన ప్రీమియర్స్ ద్వారా భారీగా వసూళ్లు సాధించినట్టు లెక్కలు అందుతున్నాయి.
నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకూ స్ర్కీనింగ్ అయిన ప్రీమియర్స్ ద్వారా 4,40,000 డాలర్లు (రూ 3,09,87,000 ) వసూళ్లు సాధించి 'గౌతమిపుత్ర శాతకర్ణి' రికార్డును 'ఎన్టీఆర్ - కథానాయకుడు' బ్రేక్ చేసింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రీమియర్స్ ద్వారా 3,75,000 డాలర్లు (రూ.2,64,14,812) రాబట్టింది. మరి లాంగ్ రన్ లో 'ఎన్టీఆర్ - కథానాయకుడు' ఇంకెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో వేచిచూద్దాం.