మాస్ రాజా రవితేజతో 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ చిత్రం 'తెరి' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం స్ర్కిఫ్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా కోసం 'కనకదుర్గ' టైటిల్ ని రిజిస్టర్ చేసారు. చాలా పవర్ ఫుల్ టైటిల్ ఇది. మాస్ రాజా రవితేజకు సరిపోయే టైటిల్ అని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్, క్యాథరీన్ ని హీరోయిన్లుగా తీసుకున్నారట. ఈ ఇద్దరూ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా కోసం స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. మరోసారి ఈ ఇద్దరూ 'కనకదుర్గ' కోసం రంగంలోకి దిగబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ పాటలందించబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 15నుంచి ఆరంభంకానుందట. సో... 'డిస్కోరాజా' సినిమా చేస్తూ బిజీగా ఉన్న రవితేజ, ఈ సినిమాతో పాటే 'కనకదుర్గ' షూటింగ్ లో కూడా పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారమ్.