'వినయ విధేయ రామ' సినిమా తర్వాత టిడిపి పార్టీ కోసం పొలిటికల్ యాడ్స్ చిత్రీకరణతో బిజీగా గడిపారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆ సందడి అయిపోయింది. ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయబోతున్న సినిమా స్ర్కిఫ్ట్ కి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇదిలా ఉంటే...
బోయపాటి శ్రీను తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకున్నారు. ఆనంతం మీడియాతో మాట్లాడుతూ - ''బాలయ్యతో షూర్ షాట్ హిట్ కొడతాను. సింహా, లెజెండ్ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి, భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను మించేలా సినిమా ఉంటుంది'' అని చెప్పారు బోయపాటి. అతి త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారమ్.