అక్కినేని అఖిల్ తదుపరి సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్ ఖరారయ్యిందని తెలుస్తోంది. రష్మిక మందన్నాని హీరోయిన్ గా తీసుకున్నారట. రష్మికాకి లక్కీ హీరోయిన్ అనే ముద్ర ఉంది. తెలుగులో తను నటించిన 'చలో', 'గీత గోవిందం', 'దేవదాసు' చిత్రాలు పెద్ద హిట్టయ్యాయి. ఈ నేపధ్యంలో రష్మికాకి లక్కీ హీరోయిన్ అనే పేరు పడిపోయింది. ఇప్పుడు'డియర్ కామ్రేడ్', అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది రష్మిక. తాజాగా అఖిల్ అక్కినేని సినిమా ఆఫర్ కూడా రష్మికను వరించడంతో ఆమె ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే...
అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోని సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా లాంచింగ్ కి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపి, వచ్చే నెల రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించబోతున్నాడు. ఇది అఖిల్ 4వ సినిమా.