'మన్మధుడు' సీక్వెల్ 'మన్మధుడు 2' చిత్రంతో బిజీగా ఉన్న కింగ్ నాగార్జున తదుపరి చిత్రంగా 'సోగ్గాడే చిని నాయనా' సీక్వెల్ 'బంగ్రారాజు' చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. 'బంగార్రాజు' చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి తీసుకురావాలని భావిస్తున్న నాగ్ త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందట.
నాగార్జున సరసన రమ్యకృష్ణను తీసుకున్నారని తెలుస్తోంది. నాగార్జున మనవరాలి పాత్ర కోసం సమంతను తీసుకున్నట్టు తెలుస్తోంది. సమంత భర్తగా నాగచైతన్య నటించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే కనుక జరిగితే 'మనం' తర్వాత నాగార్జున, నాగచైతన్య, సమంత కలిసి నటించబోతున్న సినిమా ఇదే అవుతుంది. అఖిల్ కూడా ఏదైనా గెస్ట్ అఫియరెన్స్ పాత్రలో కనిపిస్తే, అక్కినేని అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. 'మనం 2' ని తలపిస్తుంది. పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి, ఈ సినిమా పర్ ఫెక్ట్ పండుగ కానుక అవుతుందని చెప్పొచ్చు.