సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ సినిమాకి సంబంధించిన టైటిల్, మహేష్ బాబు ఫ్రీ లుక్ ను విడుదల చేసారు. 'సర్కార్ వారి పాట' టైటిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మహేష్ బాబు ఫ్రీ లుక్ కి సైతం అదిరిపోయే స్పందన లభించింది. కాగా ఈ సినిమాకి హీరోయిన్ కన్ ఫార్మ్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. అయితే హీరోయిన్ విషయాన్ని చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. దీనికి కారణం ఉందట. అదేంటంటే...
సినిమా షూటింగ్ లు జూలై, ఆగస్ట్ లో ఆరంభమైతే తనకున్న బాలీవుడ్ కమిట్ మెంట్స్ వల్ల కియారా అద్వాని 'సర్కార్ వారి పాట' కు డేట్స్ కేటాయించలేదట. అదే సెప్టెంబర్ తర్వాత అయితే, కియారా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉందట. షూటింగ్ కి సంబంధించి దర్శక, నిర్మాతలు డిసైడ్ చేస్తే... అప్పుడు కియారా అద్వాని ఫైనల్ అగ్రిమెంట్ ఇవ్వనుందట. షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్ పడిన వెంటనే డైరెక్టర్ పరశురామ్ షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో డెసిషన్ తీసుకుంటాడట. అప్పుడు కియారాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారమ్.